మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. 90 శాతం ప్రమాదాలు దాని వల

0
72

-కల్ప నా విశ్వనాథ్

జనవరి 1 తొలి క్షణాల్లోనే దేశ రాజధానిలో ఒక యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల దూరం లాక్కు పోయిన ఘటన 2023 సం వత్స రానికి భయానక మైన ప్రారం భాన్ని ఇచ్చిం ది. రహదారి భద్రత భారతదేశం లో అతిపెద్ద సమస్య . రోడ్డుపై సం భవిస్తున్న మరణాల్లోదాదాపు 90 శాతం అతివేగం , ఓవర్ టేకిం గ్, ప్రమాదకరమైన డ్రైవిం గ్ వల్లే జరుగుతున్నా యి.

ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, రోడ్డు ప్రమాదాలకు సం బం ధించి 20 అగ్రశ్రేణి దేశాల్లో ఇండియా తొలి స్థానంలో ఉంది. వీటికి అదనంగా చీకటిపడ్డాక బహిరంగ ప్రదేశాల్లోప్రయాణిస్తున్నప్పుడు లైంగిక దాడి భయం మహిళలను వెంటాడుతుం టుంది. మహిళల కదలికలను హింస, భయం అడ్డుకుంటున్నాయి. వీటికి పేలవమైన ప్రజా రవాణా సేవలు తోడవుతున్నాయి.

జనవరి 1న ఐదుగురు పురుషులు ఉన్న కారు ఒక యువతి బైక్ని ఢీకొట్టి పలు కిలోమీటర్ల దూరం ఆమెను లాక్కునిపోయిన ఘోరమైన ఉదంతం , 2023 సంవత్సరానికి భయానకమైన ప్రారంభాన్ని ఇచ్చింది. ఈ ఘటనలో ప్రమాదకరమైన అనేక అంశాలు దాగి ఉన్నాయి. మొదటగా, వారు ఒక అమ్మా యిని తమ కారుతో 4 కిలోమీటర్ల దూరం లాక్కె ళ్లి పోతున్నా మనే స్పృ హ కూడా లేనం త పూటుగా తాగి ఉన్న ట్లు వార్తలొచ్చా యి. లేదా వారు స్పృ హలో ఉం డి ఉం డవచ్చు కూడా.

రెండు.. ద్వి చక్ర వాహనాన్ని నడుపుతున్న యువతిని కారుతో ఢీకొట్టిన డ్రైవర్ ఆమెకు సహాయం చేయాలని కూడా భావిం చలేదు. బదులుగా, అతడు చాలా వేగం గా కారు తోలాడు. ఒక వార్త ప్రకారం , కారులో ఉన్న వారు ఆ తర్వా త కారు ఆపి యువతి శరీరాన్ని కారు కిం దనుం చి తొలగిం చి పారిపోయారు. ఈ విషయం లో వారు ఎలాం టి విచక్షణ, స్పం దన లేకుండా వ్యవహరించారు. ఒక చావుకు కారణమయ్యా మనే ఆలోచన కూడా వారికి లేదు. ఒక వ్య క్తిని కాపాడటం కంటే తమను తాము కాపాడుకోవడం గురించే వారు ఆందోళన చెందారు. అం దుకే రోడ్డుమీదే ఆమెను చని పోయేలా చేసి వెళ్లిపోయారు.

దారినపోతున్న వారు పోలీసులకు ఆమె గురిం చి సమాచారం ఇచ్చా రు. వీధిలోని సీసీటీవీ కెమెరా ద్వా రా కారును గుర్తిం చారు. పైగా, ఆ మహిళ రోడ్డుమీద వివస్త్రగా పడి ఉన్నం దున, ఆమెపై లైం గిక దాడి జరిగి ఉం టుం దేమో ఆనే కోణం లో కూడా విచారణ జరుగుతోంది. ఆ యువతికి 20 సం వత్స రాలుంటాయి. తన పని ముగిం చుకుని ఆమె ఇం టికి వెళుతోంది. ఆమెకు ఎదురైన భయానకమైన మరణాన్ని , తద్వా రా ఆమె తల్లి, ఇతర కుటుం బ సభ్యు ల దుః స్థితిని తల్చుకోవాలం టే కూడా హృదయం బద్దలవుతోంది.

రహదారి భద్రత అతిపెద్ద సమస్య

రహదారి భద్రత భారతదేశంలో అతిపెద్ద సమస్య . దుర్బలమైనవారు మరింత ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. రోడ్డు పక్క న కూర్చుని లేదా నిద్రపోతున్న వారిని వేగంగా పోతున్న కార్లు ఢీకొని ప్రమాదాలకు గురిచేస్తున్న అనేక ఉదంతాలు ఉన్నా యి. కేవలం 2021లోనే 1.5 లక్షల మం ది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారు. కొన్నేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతోంది.

నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం , వీటిల్లో1.9 శాతం మద్యం , మత్తు పదార్థాల ప్రభావంలో జరిగినవి. రోడ్డుపై సం భవి స్తున్న మరణాల్లోదాదాపు 90 శాతం అతివేగం , ఓవర్ టేకింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి. 2019 నుం చి ప్రపంచ బ్యాంకు డేటాను పరిశీలిస్తే, అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 20 అగ్రశ్రేణి దేశాల్లోఇండియా తొలి స్థానంలో ఉంది.

చీకటిపడ్డాక బహిరంగ ప్రదేశాల్లోప్రయాణి స్తున్నప్పు డు లైంగిక దాడికి సంబంధించిన భయం కూడా మహిళలను వెం టాడుతుంటుంది. ఈ ఉదంతంలో లైంగిక దాడి రుజువు కాకున్నప్పటికీ, అలాంటి దాడి జరిగే అవకాశం ఉందన్న వాస్తవం ఈ దేశంలోని ప్రతి మహిళకూ అదనపు ఆందోళనను కలిగిస్తుంటుంది. జాతీయ మహిళా కమిషన్ ప్రత్యేకించి పేర్కొన్నట్లుగా, ఈ కోణాన్ని కూడా ఈ ఉదంతంలో పరిశీలించడం చాలా ముఖ్యం .

నగరాలు మహిళలకు అందిస్తున్న అవకాశాలు, వాటిని వారు దక్కించుకుంటున్న సామర్థ్యాలపై హింస గణనీయమైన ప్రభావం చూపుతోంది. ఐక్యరాజ్యసమితి, ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్’ పరిశోధన ప్రకారం నగరాల్లోమహిళలు అనేక రూపాల హింసకు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పెద్దగా అరిచి భయపెట్టడం , దేహ భాగాలను గట్టిగా నొక్కడం , వెంబడించడంతో పాటు, లైంగిక దాడి వంటి తీవ్ర నేరాలు కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజూ జరుగుతున్న ఈ హింస, వేధింపులు నగరంలోని బహిరంగ ప్రదేశాల్లోమహిళల అనుభవాలను నిర్దేశిస్తున్నాయి.

నగరాల్లోమహిళల కదలికలను హింస, భయం అడ్డుకుంటున్నాయి. వీటికి పేలవ మైన ప్రజా రవాణా సేవలు తోడవుతున్నాయి. పనిచేయడం , తిరిగి రావడం విషయం లో కీలక వేళల్లో రవాణా ప్రణాళికలు సాధారణంగా పురు షుల ప్రయాణ నమూనాలపైనే దృ ష్టి పెడు తున్నాయి. మరోవైపు మహిళల ప్రయాణ నమూనాలు వారి సంరక్షక పాత్రల దృ ష్ట్యా పురుషులతో పోలిస్తే తరచుగా విభిన్నంగా ఉంటున్నాయని మహిళల కదలికలపై ప్రపంచ బ్యాంక్ నివేదిక చెబుతోంది.

మహిళల ప్రయాణాల్లో84 శాతం వరకు ప్రజా రవాణా ద్వారానే జరుగుతున్నాయని ఇదే నివేదిక తెలుపుతోంది. పనికి నడిచిపోవడాన్నే మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో మహిళల వాటా 45.4 శాతంగా ఉండగా, పురుషుల శాతం 27.4గా మాత్రమే ఉంటోంది. పైగా చాలామంది మహిళలు బస్సు ద్వారా ప్రయా ణిస్తున్నారు. తాము ప్రయాణిస్తున్నప్పుడు మహిళలు స్థోమతను చూసుకుంటారని ఈ నివేదిక చెబుతోంది. ఖర్చు ఎక్కు వయ్యే వేగ ప్రయాణాల కంటే ఖర్చు తక్కు వగా ఉండే నిదాన ప్రయాణ సాధనాలనే వీరు ఎంపిక చేసుకుంటున్నా రు.

రోడ్డు ప్రమాద బాధితుల్లోఅధిక శాతం పురుషులేనని నివేదిక చెబుతోంది. అంటే మహిళలతో పోలిస్తే పురుషులు చాలా ఎక్కువగా బయట కెళ్లడానికి ఇష్ట పడుతుంటారనీ, సొంత బైక్ని కలిగి ఉంటారనీ, రాత్రిపూట ప్రయాణిస్తుంటారనీ ఇది ఎత్తి చూపుతోంది. మహిళల కదలికలపై ఆంక్షలు అనేవి పితృ స్వామిక ఆచారాలు సంరక్షక భారం నుంచి ఏర్పడుతున్నా యి. పైగా శ్రామిక శక్తిలో మహిళల స్వల్ప పాత్రపై ఇవి ప్రభావం చూపుతున్నాయి.

ప్రపంచంలోకెల్లా రోడ్డు ప్రమాదాల్లోఅధిక మరణాలకు సంబంధించి భారతదేశం అత్య ధిక రేటును కలిగి ఉంటోంది. బహిరంగ స్థలాల్లోమహిళలపై హింసకు సంబంధించిన అత్యధిక రేటు కూడా భారత్ సొంతమై ఉంది. మన వీధులు, రహదారులు అటు ప్రమాదాలు, ఇటు నేరాల నుంచి తప్పనిసరిగా సురక్షితంగా ఉండాలి. శర వేగంగా వెళ్లే కార్ల కంటే పాదచారుల సురక్షిత కదలికలకు వీలిచ్చేలా వీధులను రూపొందించాలి.

ఇదే మన నగరాలను గణనీయంగా మారుస్తుంది. కార్లు అతివేగంగా దూసుకెళ్లేలా, మరిన్ని ఫ్లై ఓవర్లకు, ఓవర్ బ్రిడ్జిలకు, పెద్దగా వెలుతురు లేని రహదారులకు దారులు తీస్తున్న మన ప్రస్తుత రహదారి ప్రణాళికలు పాదచారులు సులభంగా గాయాలకు, హింసకు లోనయ్యేలా రూపొందుతున్నాయి. రద్దీగానూ, చక్కటి వెలుతురుతోనూ ఉంటూ మంచి పేవ్మెం ట్లు, ట్లువీధుల్లోవిక్రేతలు, షాపులు, నిఘా కెమెరాలతో కూడిన కెఫేలు తాము సురక్షితంగా ఉన్నామని మహిళలు భావిం చడానికి ఎంతో అను కూలంగా ఉంటాయని దేశవ్యా ప్తంగా ‘సేఫ్టీపిన్’ సంస్థ ద్వా రా జరిగిన భద్రతాపరమైన మదింపులు స్పష్టం చేస్తున్నాయి.

అదేవిధంగా, సైక్లింగ్ కోసం మౌలిక వసతుల కల్పన, ప్రజారవాణాను అందుబాటులోనూ, చౌకగానూ ఉంచడం వల్ల వీధుల్లో ట్రాఫిక్ తగ్గుతుం ది. ఈ చర్య లు మన వీధులను సురక్షితంగానూ, అందుబాటులో ఉండేలా, ఎక్కు వమందికి అనుకూలంగా మలుస్తాయి.

Leave a Reply